CM Revanth Reddy: మహిళల కోసం భవిష్యత్తులో మరిన్ని ఆసుపత్రులు..
- పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు..
- మేఘా కృష్ణా రెడ్డి- సుధా రెడ్డి కి ధన్యవాదాలు..
- స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మేఘా కృష్ణా రెడ్డి, సుధా రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని శుభవార్త చెప్పారు. గచ్చిబౌలి స్టేడియం సాక్షిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ లో భాగంగా మెయిల్ ఆధ్వర్యంలో సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా మారతాన్ నిర్వహించారు. మారతాన్ అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశారు. సీఎం రేవంత్ సమక్షంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు…
హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. 3K, 5K మరియు 10K పరుగులు ఏకకాలంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్యాన్సర్పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్ను ముందుగా గుర్తించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తిస్తే సరైన చికిత్సతో మహమ్మారిని తరిమికొట్టవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ 2024 నిర్వహించారు.
Tamilnadu: భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
తాజావార్తలు
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!