New IT Park In HYD: సింగపూర్లో సీఎం రేవంత్ పర్యటన.. హైదరాబాద్లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్
- సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ పర్యటన..
- హైదరాబాద్లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్..
- క్యాపిటల్ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New IT Park In HYD: సింగపూర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్లో అత్యాధునిక 1 మిలియన్ చదరపు అడుగుల పార్క్ను అభివృద్ధి చేయడానికి రూ. 450 కోట్ల పెట్టుబడిని క్యాపిటల్ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ ఖియాతానీ ప్రకటించారు. ఇక, వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడంతో పాటు రాబోయే కొత్త ప్రాజెక్ట్ గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్లు (GCCS), ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ-చిప్ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తీర్చగలదు అన్నారు.
Read Also: Saif Ali Khan : సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.
Also Read
ఇక, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్యాపిటల్ల్యాండ్ గ్రూప్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించారు. వ్యాపార, సాంకేతిక హబ్గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించారు. క్యాపిటల్ గ్రూప్ విభిన్నమైన పోర్ట్ఫోలియో రిటైల్, ఆఫీస్, లాడ్జింగ్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లను విస్తరించిందన్నారు. అలాగే, హైదరాబాద్ లో అంతర్జాతీయ టెక్ పార్క్ హైదరాబాద్ (ITPH), అవాన్స్ హైదరాబాద్, సైబర్పెర్ల్ అనే మూడు వ్యాపార పార్కులను నిర్వహిస్తోంది. కాగా, క్యాపిటల్ల్యాండ్ గతంలో ప్రకటించిన 25 ఎండ్య్లూ ఇట్ లోడ్ డేటా సెంటర్ హైదరాబాద్లో 2025 మధ్య నాటికి పని చేయడానికి సిద్ధంగా ఉంది.. ఇది భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్ కీలకం కానుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ఐటీపీహెచ్)లో రెండవ దశ పునరాభివృద్ధి ఈ ఏడాది స్టార్ట్ అయి.. 2028 నాటికి పూర్తి కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!