MLA Rajasingh: అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
- ఓల్డ్ సిటీలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి..
- అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఈ మర్డర్లు జరుగుతున్నాయి: రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajasingh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందన్నారు. ఈ నెలలోనే అత్యధికంగా మర్డర్లు జరిగాయి.. ఓల్డ్ సిటీలో తెల్లవారు జామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు.. దుకాణాలను బంద్ చేసేందుకే పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారు.. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారు.. ఎంఐఎం నేతలకు పాతబస్తీ అడ్డాగా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి.. మర్డర్లు జరిగేది కూడా వాళ్ల కులస్తులవే కదా.. దాన్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఇక, అందులో నీకు బాధ ఏంటి అసద్ అని రాజాసింగ్ ప్రశ్నించారు. చచ్చేది మీ వాళ్లే కదా.. పోలీసులపై ఒత్తిడి ఎందుక తెస్తున్నట్లు? అంటూ మండిపడ్డారు. వారి ఒత్తిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడు.. బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలా పత్తర్, కాచిగూడ, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోంది.. మేడ్చల్ లో తెల్లవారు జామున పోలీస్ స్టేషన్ పక్కనే దోపిడీ, మర్డర్ చేశారు.. పోలీసులు అంటే భయం లేకపోవడంతో మర్డర్లు, దోపిడీ చేయొచ్చని ఇంకా చెలరేగిపోతున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. ఇలాంటివి జరగొద్దంటే ముఖ్యమంత్రి భయపడొద్దు.. పోలీసులు మీ ఆదేశాలు ఫాలో చేయాలి.. అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలు కాదు అని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!