BJP Morcha: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. బీజేపీ మోర్చ ఘాటు విమర్శలు..
- దేశ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా రాహుల్ గాంధీ మాటలు..
- బీజేపీ మోర్చా ఆగ్రహం వ్యక్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Morcha: దేశ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద మాట్లాడారని బీజేపీ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ దళిత గిరిజన బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు తొలగిస్తా మని అంటున్నారని తెలిపారు. గతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ లు కూడా రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అంబేద్కర్ ను చట్ట సభల్లో అడుగుపెట్టనీయోద్దని చూసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించడం నెహ్రూ కి ఇష్టం లేదన్నారు. రాజీవ్ గాంధీ దృష్టిలో రిజర్వేషన్ లు పొందుతున్న వారు మూర్ఖులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని తెలిపారు. రిజర్వేషన్ లు ఎత్తి వేస్తుందని బీజేపీ పై అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇక్కడ ఓట్ల కోసం బీజేపీ రిజర్వేషన్ లు ఎత్తివేస్తుందని మాట్లాడుతాడని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ దినోత్సవంను జరపలేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక కాన్స్టిట్యూషన్ డే జరుపుతున్నారన్నారు. ముస్లింల ఓట్ల కోసం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ లు వాళ్ళకి కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీ అని క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన మనసులో మాట విదేశాలకు వెళ్లి బయట పెట్టారన్నారు. రిజర్వేషన్ లను తగ్గిస్తామని మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పప్పు అని తెలిసే ఆయన్ని ప్రధాని చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తలలో మెదడు లేకుండా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకి, మోడీ కి బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!