BJP Morcha: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. బీజేపీ మోర్చ ఘాటు విమర్శలు..
- దేశ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా రాహుల్ గాంధీ మాటలు..
- బీజేపీ మోర్చా ఆగ్రహం వ్యక్తం..
BJP Morcha: దేశ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద మాట్లాడారని బీజేపీ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ దళిత గిరిజన బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు తొలగిస్తా మని అంటున్నారని తెలిపారు. గతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ లు కూడా రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. అంబేద్కర్ ను చట్ట సభల్లో అడుగుపెట్టనీయోద్దని చూసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించడం నెహ్రూ కి ఇష్టం లేదన్నారు. రాజీవ్ గాంధీ దృష్టిలో రిజర్వేషన్ లు పొందుతున్న వారు మూర్ఖులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని తెలిపారు. రిజర్వేషన్ లు ఎత్తి వేస్తుందని బీజేపీ పై అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇక్కడ ఓట్ల కోసం బీజేపీ రిజర్వేషన్ లు ఎత్తివేస్తుందని మాట్లాడుతాడని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ దినోత్సవంను జరపలేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక కాన్స్టిట్యూషన్ డే జరుపుతున్నారన్నారు. ముస్లింల ఓట్ల కోసం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ లు వాళ్ళకి కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీ అని క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన మనసులో మాట విదేశాలకు వెళ్లి బయట పెట్టారన్నారు. రిజర్వేషన్ లను తగ్గిస్తామని మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పప్పు అని తెలిసే ఆయన్ని ప్రధాని చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తలలో మెదడు లేకుండా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకి, మోడీ కి బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!