Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేది..
- బీజేపీ అధికారం లోకి వచ్చి ఉంటే ఒక్కో ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేది..
- చెరువులో కట్టామని ఓవైసీ ఒప్పుకున్న ఎందుకు తొలగించడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వచ్చి ఉంటే ఒక్కో ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కి ఎందుకు మినహాయింపు… చెరువులో కట్టామని ఆయన ఒప్పుకున్న ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొత్త తరం రావాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. MIM పార్టీ పీడ విరగడ కావాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలన్నారు.
Read also: Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
బీజేపీ, జన సంఘ్, జనతా పార్టీ లేకుంటే దేశాన్ని కాంగ్రెస్ 7 ముక్కలు చేసేదన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని తెలిపారు. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందన్నారు. కాంగ్రెస్ ,BRS పార్టీల కోసం త్యాగం చేసిన కార్యకర్తలను ఆ పార్టీ నేతలు గుర్తించుకోరన్నారు. పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతీ కార్యకర్తను బీజేపీ గుర్తుంచుకుంటుందన్నారు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ BRS మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ కు గుర్తుకువచ్చేది కేవలం నెహ్రూ, రాజీవ్ గాంధీ లే అని కీలక వ్యాఖ్యలు చేశారు. BRS కు గుర్తుకు వచ్చేది కెసిఅర్, కేటీఆర్, హరీష్, సంతోష్ లే అని తెలిపారు. సభ్యత్వం చేయాలని కోరే హక్కు బీజేపీ కి మాత్రమే ఉందన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందన్నారు.
Read also: CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..
కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా కంపెనీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దోళ్ల బిల్డింగ్ లు కూల కొడితే స్వాగతిస్తం, పెదోళ్ల జోలికి వస్తె ఊరుకోమన్నారు. ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుందని, ఓవైసీ కి ఎందుకు మినహాయింపు… చెరువులో కట్టామని ఆయన ఒప్పుకున్న ఎందుకు తొలగించడం లేదు? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వచ్చి ఉంటే ఒక్కో ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేదన్నారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసిన బీఆర్ఎస్ ను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తల మీద కేసులు పెట్టీ హింసించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 2028 లో తెలంగాణ లో అధికారం లోకి వచ్చేది బీజేపీ నే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లో విలీనం అవుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది… అది అయ్యే పని కాదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఆలోచించుకోవాలని తెలిపారు.
Lorry Accident: లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థి మృతి ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్..
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!