హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు లోకదళత్ ఉంటుందన్న ఎస్ఎంస్ వైరల్ అవుతున్నట్లు మేం గమనించామని.. అది నకిలీ సందేశం.. ఎవ్వరూ నమ్మవద్దు.. ఆ ఫేక్ న్యూస్ను వైరల్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.. ఆ ఫేక్ సందేశాన్ని పోస్ట్ చేసినా లేదా ఫార్వార్డ్ చేసినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఫేక్.. ట్రాఫిక్ పోలీసుల క్లారిటీ..
