హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు పరిధిలో గల ఒక రిసార్ట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక పక్క పెళ్లి వేడుకతో బంధువులందరూ సందడిగా ఉన్న తరుణంలో, అనుకోని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆడుకుంటూ వెళ్లిన ఓ 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడి మృత్యువాత పడ్డాడు. చిలుకూరులోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో బంధువుల పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ శుభకార్యానికి హాజరైన సదరు బాలుడు, వేడుకలో అందరూ నిమగ్నమై ఉన్న సమయంలో ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ బాలుడు పూల్లో పడిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కొంత సమయం తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు , బంధువులు వెంటనే స్పందించి బాలుడిని బయటకు తీశారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
అయితే, అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రిసార్ట్ యాజమాన్యం స్విమ్మింగ్ పూల్ వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టలేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంతోషంగా సాగాల్సిన వేడుకలో తమ కళ్లముందే పిల్లాడు మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్బ్యాండ్ కేవలం రూ.999కే..!
