Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro:: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్స్లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్కు నగరం నలుమూలల నుంచి సందర్శకులు పోటెత్తారు. ఇదిలా ఉండగా.. ఎప్పటిలాగే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. దాదాపు 22 లక్షల మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
Read also: WhatsApp: 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ టిక్కెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్.. వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు.. వారాంతాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. అయితే.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాలతో లోపలికి వెళ్లి దర్శించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అయితే.. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో దేశం నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేసారు. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేనేత వస్త్రాల నుండి వంట సామాగ్రి వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇందులో ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.
Electoral Bonds: ఇవాళ్టి నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం..
తాజావార్తలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!