Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hitech City Railway Station Development Kishan Reddy Inspection

Kishan Reddy : హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ రూ.35 కోట్లతో ఆధునీకరణ.!

Published Date :November 28, 2025 , 5:47 pm
By Gogikar Sai Krishna
  • హైటెక్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్ వేగం
  • తెలంగాణలో 40 స్టేషన్ల అభివృద్ధి
  • ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు
  • ఫస్ట్ ఫేజ్ త్వరలో పూర్తి
Kishan Reddy : హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ రూ.35 కోట్లతో ఆధునీకరణ.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Kishan Reddy : హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించే పనులను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ స్టేషన్ అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుండగా, మొత్తం 35 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలను కల్పించే పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సాంకేతిక ప్రగతికి కేంద్ర బిందువుగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, టూరిజం రంగానికి చెందిన వారు ఉపయోగించే ఈ స్టేషన్‌ను ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రైల్వే అభివృద్ధి ఎన్నడూ లేనంత వేగంగా సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే లైన్ల నిర్మాణం నుంచి స్టేషన్ల ఆధునీకరణ వరకు రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతుండటం ఇదే మొదటి సారేనని చెప్పారు. ఇటీవలే చర్లపల్లి న్యూ టర్మినల్‌ను ప్రధాని ప్రారంభించగా, హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి టర్మినల్స్‌కు తోడుగా ఇది నాలుగో ప్రధాన టర్మినల్‌గా సేవలు అందిస్తోంది.

Also Read

  • Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్‌లో చీప్ లిక్కర్..
  • TG Inter Admissions: పాఠ‌శాల విద్యలో ఇంట‌ర్మీడియ‌ట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
  • Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
Add as a preferred
source on google

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 720 కోట్లతో, కాచిగూడ స్టేషన్‌ను 424 కోట్లతో ఆధునీకరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఫస్ట్ ఫేజ్‌గా 26 కోట్లతో కొత్త భవనాలు, అప్రోచ్ రోడ్లు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, రెండో దశలో మరో 10 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 62 సబర్బన్, ఎంఎంటీఎస్ రైళ్లు ఈ స్టేషన్ వద్ద ఆగుతుండగా, సుమారు 5,400 మంది ప్రయాణికులు సేవలు పొందుతున్నారని తెలిపారు. ఆధునీకరణ అనంతరం ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టేషన్‌లో నాలుగు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, ఆధునిక వెయిటింగ్ రూమ్స్, దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పనులన్నీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి ఫస్ట్ ఫేజ్ — వెస్ట్ సైడ్ భాగం పూర్తయ్యేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. దసరా సమయంలో ముంబై, కాజీపేట, విశాఖపట్నం రూట్లలో నడిచే రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ సిటీలో ఆపినట్లు, అలాగే సంక్రాంతి సందర్భంగా 16 స్పెషల్ ట్రైన్లు కూడా ఇక్కడ ఆగనున్నట్లు తెలిపారు. మరిన్ని రైళ్లు ఇక్కడ ఆపేందుకు ట్రయల్ బేసిస్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లతో పాటు కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తిగా ముగిసిందని, త్వరలో భక్తుల కోసం ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను యాదాద్రి వరకు పొడిగించే ప్రతిపాదనపై ఇప్పటికే టెండర్లు జరిగుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ 100 శాతం పూర్తయిందని, వైఫైతో సహా అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కాజీపేటలో నిర్మాణం జరుగుతున్న రైల్వే మల్టీ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులను రేపు పరిశీలించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైల్వే మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్ది, కొత్త రైల్వే లైన్ల నిర్మాణంతో మరింత అభివృద్ధి సాధించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, బడ్జెట్‌ను ముందు ఊహించని స్థాయిలో భారీగా కేటాయిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amrit Bharat Scheme
  • Hitech City Station
  • Kishan Reddy
  • Telangana Railways

తాజావార్తలు

  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

  • Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?

  • PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions