High Court: గ్రూప్-1పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం
- పారదర్శకత లోపించిందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం పై ఆక్షేపణ
- టీజీపీఎస్సీ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు
- రెండు సెంటర్లలో రాసిన 71 మంది మహిళల ఎంపికపై సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: హైకోర్టు తాజాగా ఇచ్చిన 222 పేజీల తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పనితీరుపై తీవ్ర ఆక్షేపణలు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్-1 పరీక్షలు రద్దయినా, టీజీపీఎస్సీ తన పనితీరులో మార్పు తీసుకురాలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా, మళ్లీ నిర్లక్ష్యంతో ముందుకు సాగిందని కోర్టు విమర్శించింది.
Also Read
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
తీర్పులో కోర్టు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల సమస్యను ప్రస్తావించింది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులలో 89.9% మంది సెలెక్ట్ అవ్వగా, తెలుగు మీడియం అభ్యర్థులలో కేవలం 9.95% మాత్రమే ఎంపిక కావడం తీవ్రమైన అసమానత అని పేర్కొంది. “తెలుగు మీడియం విద్యార్థులు బాగా రాయలేదనే నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ ఎందుకు అడుగుతున్నారు?” అని కోర్టు ప్రశ్నించింది. ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో సరైన విధానాన్ని పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా, “ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)లో గ్రూప్-1 నియామకం మూడు దశల్లో జరుగుతుంది – ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. కానీ తెలంగాణలో మాత్రం కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉన్నాయి” అని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, రెండు సెంటర్లలో పరీక్ష రాసిన 71 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక కావడం ఎలా సాధ్యమైందని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంలో కూడా టీజీపీఎస్సీ నిర్లక్ష్యం స్పష్టమైందని పేర్కొంది. “రోజుకు 12 గంటలు కోచింగ్ సెంటర్లలో శ్రమిస్తున్న యువతను టీజీపీఎస్సీ నిర్లక్ష్యం తీవ్రంగా నష్టపరిచింది” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా పరీక్షలను నిర్వహించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!