దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయం మీద మాట్లాడాలి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో పాలన ఎలా ఉండేదో గుర్తుకు ఎరిగి మాట్లాడితే మంచిదన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే పేర్లు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది అని విమర్శలు చేస్తున్నారు. వాస్తవం తెలుసుకొని మాట్లాడితే ప్రజలు ఆ నాయకులకు గౌరవం దక్కుతుందని అన్నారు. కేంద్ర పథకాలు మేము కాపీ కొట్టడం లేదు .మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలనే కేంద్రం కాపీ కొట్టిందని అన్నారు. మన రైతు బంధు పథకం కాపీ కొట్టి మోడీ గారు దేశంలో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంను కేంద్రం తుంగలో తొక్కిందని, అన్యాయంగా మన రాష్ట్రానికి చెందిన సీలేరు ప్రాజెక్టు, 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం కలిపిందని అన్నారు.
దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయం పైన మాట్లాడాలని ఆయన అన్నారు. ఇంకా కొందరు నేతలు అయితే కేసీఆర్ గారిని అగౌరవంగా, నీచంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.వారి వల్ల సభ్యసమాజం సిగ్గు పడుతుందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికారంలోకి రాలేని,అసలు రావడానికి అవకాశం లేని పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు మురిగినట్టేనని ఆయన అన్నారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి.ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వస్తాను అంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి ? రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంగా మాట్లాడుతున్నాను అని కొందరు నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారని అది సరి కాదని అన్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!