Firing in Madhapur: రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం..బాలనగర్ డీసీపీ సందీప్ క్లారీటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ కాల్పులు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తాడ్ బన్ లోని 250 గజాల ల్యాండ్ తోనే వివాదం చెలరేగడంతో.. ఇస్మాయిల్ కొన్నాళ్ల క్రితమే మమ్మద్ ముజాయుద్దీ పేరు గిఫ్ట్ డిడ్ చేసాడు. స్థల వివాదం పరిష్కారం కోసం మహమ్మద్ ముజాహిదీన్ మాదాపూర్ కి ఇస్మాయిల్ ను పిలిపించారు. ఇస్మాయిల్ , ముజి మాట్లాడుకుంటున్న సమయంలో జిలానీ ఫైర్ ఓపెన్ చేసాడు. మహమ్మద్ ముజాహిద్దీన్ రైట్ యాండ్ గా ఉన్న జిలానీ, ఇస్మాయిల్ పై కంట్రిమేడ్ వెపన్ తో ఆరు రౌండ్లు కాల్పులు చేసాడు. మృతుడు ఇస్మాయిల్, నిందితుడు ముజాహిద్దీన్ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.
read also: Firing in Madhapur: రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం..బాలనగర్ డీసీపీ సందీప్ క్లారీటీ
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
ఈ సంఘటనపై పూర్తీ వివరాలు.. బాలనగర్ డీసీపీ సందీప్ రావు మాట్లాడుతూ.. మాదాపూర్ పీఎస్ పరిధిలో ఇస్మాయిల్ వ్యక్తి పై నీరుస్ జంక్షన్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ పై జిలానీ కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఇస్మాయిల్ తో మమ్మద్ ముజాహిద్ మాట్లాడుతుండగా జిలానీ కాల్పులు జరిపారని తెలిపారు. ఇస్మాయిల్ తో మమ్మద్ ముజాహిద్ మధ్య ల్యాండ్ వివాదం ఉందని, దీంతో మాట్లాడుతుండగా గొడవ తలెత్తిందని వివరించారు. కంట్రీ మెయిడ్ వెపన్ తో మూడు రౌండ్ లు కాల్పులు జరిపారని, సాయంత్రం నుండి వీరికి ఉన్న ల్యాండ్ వివాదం పై చర్చలు జరుపుతున్నారని అన్నారు. మాసబ్ ట్యాంక్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ వచ్చారని, మధ్య రాత్రికి మాదాపూర్ కి చేరుకున్నారని, రెండున్నర గంటల పాటు ఇద్దరి మధ్య మాట్లాడుకున్నారని పేర్కొన్నారు.
తెల్లవారు జామున నాలుగు గంటలకు జిలానీ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణమని తెలిపారు. సంగారెడ్డిలో వీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని గుర్తించామన్నారు. పథకం ప్రకారమే కాల్పులు జరిపారా అనేది తెలియాల్సి ఉందని అన్నారు. జిలానీ నే మొదటగా ఫైరింగ్ చేశారని గుర్తించామన్నారు. జిలానీ పై గతంలో కేసులు ఉన్నాయని ,రెండు నుండి మూడు రౌండ్స్ కాల్పులు జరిగాయని స్పష్టం చేసారు. అతి దగ్గర నుండి ఇస్మాయిల్ పై కాల్పులు జరిపినట్లు గుర్తించామని అన్నారు. ఇస్మాయిల్ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారని, నిందితుడు వాహనంలో ఇద్దరు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఇస్మాయిల్ తో పాటు జహంగీర్ ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని స్పష్టం చేసారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!