Gujjula Premender Reddy: ఆ వ్యవహారం నడిపింది టీఆర్ఎస్ పార్టీనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujjula Premender Reddy Reacts On Rit Peitition In High Court: మొయినాబాద్ ఫాంహౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సాగిన బేరసారాల వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీపై అభాండాలు మోపుతూ.. బట్ట కాల్చి మీదేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే తాము నిష్పక్షపాత దర్యాప్తును కోరుతూ.. రాష్ట్ర హైక్టోర్టులో గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ‘రిట్’ అప్పీల్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని నడిపింది టీఆర్ఎస్ పార్టీనేనని, అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ వాళ్లేనని ఆరోపించారు. తమను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది, ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ వాళ్లేనని అన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం ఎక్కడా కనిపించడం లేదని, ఇదంతా టీఆర్ఎస్ ఆడిన డ్రామా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యవహారంలో బీజేపీ ప్రమేయం లేకపోయినప్పటికీ.. బీజేపీపై బురద జల్లే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోందని ప్రేమేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి నడిపిన కుట్ర అని స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు పక్షపాతపూరితంగా ఉండే అవకాశం ఉందని, అందుకే నిష్పక్షపాత దర్యాప్తు కోసం రాష్ట్ర హైకోర్టు తలుపులు తట్టామని పేర్కొన్నారు. కానీ హైకోర్టు ఆదేశాలు రాకముందే.. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్మీట్ పెట్టి, బీజేపీపై నిందలు మోపారన్నారు. ఆయన ఆధ్వర్యంలో పని చేసే రాష్ట్ర పోలీసులతో ఏర్పాటు చేసిన సిట్పై తమకు నమ్మకం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందంగా వండి వార్చిన ఈ వ్యవహారంలో.. తమ నిర్దోశిత్వాన్ని నిరూపించుకునేందుకే సీబీఐ లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు.
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!