NTV Telugu Site icon

Harish Rao: 140 స్టాల్స్ తో నర్సరీ మేళా.. ప్రారంభించిన మంత్రి

Harish Rao

Harish Rao

Grand Nursery Mela At People’s Plaza Necllace Road: గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు, కానీ.. ఈ తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు. పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇవాళ్టి నుండి ఈనెల 22 వరకు గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి 120 పైగా స్టాల్స్ ఏర్పాటు చేసారన్నారు. స్టాల్స్ లో 100 పైగా అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శన, విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం అయ్యిందని మంత్రి తెలిపారు.

140 స్టాల్స్ తో నర్సరీ మేళా స్టార్ట్ అయ్యిందని తెలిపారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పీపుల్స్ ప్లాజాలో ఈ నర్సరీ ఉందని, అన్ని ఒకే చోట దొరుకుతాయని పేర్కొన్నారు. మీ ఇంటి దగ్గర గార్డెన్స్ ఏర్పాటు చేసుకోండని అన్నారు. గ్రామాల్లో హరితహారంతో మొక్కలు పెంచటం లాంటి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పల్లె ప్రకృతి వనాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయని అన్నారు. చెట్ల పెంపకం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ శ్రీకారం చుట్టిందని అన్నారు. గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు, కానీ ఈ తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 31.6 శాతం గ్రీనరి పెరిగిందని, తెలంగాణా అడవులను బ్రతికించటం, ముళ్ల చెట్లు పెట్టి, అడవులని పునరజ్జీవనం చేసేలా చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్‌ రావ్‌ తెలిపారు.
Kakinada : ఆ జిల్లాలో కలెక్టర్కు ఎస్పీకి పడటంలేదా..?