Kakinada : ఆ జిల్లాలో కలెక్టర్కు ఎస్పీకి పడటంలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో కలెక్టర్కి ఎస్పీకి పడటం లేదా? ఇద్దరు అధికారులకు ఏ అంశంలో చెడింది? సీఎం పర్యటనలో జరిగిన ఘటనతో గ్యాప్ ఇంకా పెరిగిందా? ఇంతకీ ఏంటా జిల్లా.. ? ఎవరా అధికారులు?
కృతికాశుక్లా. కాకినాడ జిల్లా కలెక్టర్. రవీంద్రనాథ్ బాబు.. కాకినాడ జిల్లా ఎస్పీ. కీలక విభాగాలకు జిల్లా బాస్లైన ఇద్దరు అధికారుల మధ్య పొరపచ్చాలు వచ్చాయట. కలెక్టర్ డామినేషన్ పెరిగిందని ఎస్పీ ఫీలవుతున్నారట. సర్వీస్లో సీనియర్ అయినప్పటికీ తన మాటను పట్టించుకోవడం లేదనేది ఎస్పీ వాదనగా ఉందట.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
ఈ ఏడాది ఏప్రిల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి మూడు జిల్లాలైంది. కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాకి కృతికాశుక్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్కి చెందిన ఈ IAS అధికారికి తొలిసారి కలెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అంతకు ముందు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టరేట్తోపాటు పలు విభాగాల్లో పని చేశారు. దిశా స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. రవీంద్రనాథ్బాబు 2021లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. కొత్త జిల్లాలు వచ్చాక కాకినాడకే పరిమితం అయ్యారు. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా.. వైజాగ్ క్రైమ్ డీసీపీగా విధులు నిర్వహించారు రవీంద్రనాథ్బాబు. 2001 గ్రూప్ వన్ ఆఫీసరైన ఆయన 2015లో IPS హోదా వచ్చింది.
గత నెలలో జిల్లాలో సీఎం పర్యటించారు. ప్రజలకు అభివాదం చేస్తూ హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వెళ్లేలా ప్లాన్ చేశారు సీఎంవో అధికారులు. దానికి తగ్గట్లుగా రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంతలో ఏమైందో ఏమో .. సీఎం వచ్చే సమయానికి దారి పొడవునా పబ్లిక్ లేకుండా పంపించేశారు పోలీసులు. ఈ విషయంలో సీఎంవో అధికారులు కలెక్టర్ను వివరణ అడిగారట. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులే బాధ్యత తీసుకోవాలని చెప్పేశారట. అయితే పబ్లిక్ను ఉంచాలని తమకు ఎవరూ చెప్పలేదన్నారట ఎస్పీ. దాంతో ఇద్దరు అధికారుల మధ్య గ్యాప్ వచ్చినట్టు టాక్.
జిల్లాస్థాయిలో సమీక్షా సమావేశాలు రెగ్యులర్గా జరుగుతాయి. ఎస్పీ, కలెక్టర్ తప్పకుండా పాల్గొంటారు. ఈ మధ్య జరిగిన మీటింగ్స్లో ఎస్పీ కనిపించడం లేదని.. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని పంపించారని చెబుతున్నారు. సమావేశానికి వెళ్లిన ఉపయోగం లేదు కదా.. తమను ఎవరు పరిగణనలోకి తీసుకోరు అని ఎస్పీ ఫీలవుతున్నట్టు సమాచారం. నిర్ణయాలు తీసేసుకుని.. అవి మనకు చెబుతారు అంతేగా అని నిట్టూర్పులిడుస్తున్నారట. ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా పనిచేసిన తాను సీనియర్ అధికారి అయినప్పటికీ కాకినాడ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితులు లేవని అంటున్నారట ఎస్పీ. కృతికాశుక్లా కూడా తాను IAS అయినప్పటికి.. దిశ తొలి స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం తనకు అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారట. ఇక ప్రొటోకాల్ కార్యక్రమాలకు ఇద్దరూ వచ్చినా.. ఏదో వచ్చాం అన్నట్టుగా హాజరై వెళ్లిపోతున్నట్టు కిందిస్థాయి సబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఈ గ్యాప్ ఇద్దరు బాస్ల వరకే పరిమితం అయితే ఫర్వాలేదని.. కిందిస్థాయి ఉద్యోగులపై ప్రభావం పడితే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారట.
తాజావార్తలు
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..