Governor Tamilisai: రాజ్భవన్లో భోగి వేడుకలు.. పాయసం వండిన గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇవాళ ఉదయం గవర్నర్ తమిళిసై పొగల్ భోగి వేడుకల సందర్భంగా.. పాయసం వండారు. ఆమె కట్టెల పొయ్యి మీద కుండలో పాయసం వండారు. దేశ, తెలుగు ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు శ్రీరాముడిపై ఓ పాటను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు.
Read also: Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..
Also Read
తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ కుండలో పాయసం వండారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. పొంగల్ తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకమని అన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం పూర్తవుతుందన్నారు. శ్రీరాముడిపై ఓ పాటను హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నట్టు గవర్నర్ తెలిపారు.
ఈ ఏడాది కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అని చెప్పారు. కాగా, శుక్రవారం పుదుచ్చేరి రాజ్నివాస్లో జరిగిన పొంగల్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కూడా పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కానున్నారు. అగ్రనేతలతో సమావేశాలకు సంబంధించిన అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!