Governor Tamilisai: రాజ్భవన్లో భోగి వేడుకలు.. పాయసం వండిన గవర్నర్
Governor Tamilisai: రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇవాళ ఉదయం గవర్నర్ తమిళిసై పొగల్ భోగి వేడుకల సందర్భంగా.. పాయసం వండారు. ఆమె కట్టెల పొయ్యి మీద కుండలో పాయసం వండారు. దేశ, తెలుగు ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు శ్రీరాముడిపై ఓ పాటను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు.
Read also: Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..
Also Read
తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ కుండలో పాయసం వండారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు. పొంగల్ తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకమని అన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం పూర్తవుతుందన్నారు. శ్రీరాముడిపై ఓ పాటను హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నట్టు గవర్నర్ తెలిపారు.
ఈ ఏడాది కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం అని చెప్పారు. కాగా, శుక్రవారం పుదుచ్చేరి రాజ్నివాస్లో జరిగిన పొంగల్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కూడా పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కానున్నారు. అగ్రనేతలతో సమావేశాలకు సంబంధించిన అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Sankranti Festival: పల్లెకు సంక్రాంతి శోభ.. గ్రామాలకు క్యూ కట్టిన పట్నం వాసులు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!