Gold ATM in Hyderabad: గోల్డ్ ఏటీఎం.. ఎప్పుడంటే అప్పుడు మీ చేతికి బంగారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold ATM in Hyderabad: ATM అంటేనే డబ్బు విత్డ్రా చేయడం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు బంగారం కూడా డ్రా చేసుకోవచ్చు. ఏంటి బంగారం ఏటీఎం నుంచి డ్రా అనే అనుమానమే వద్దండోయ్. మీరు విన్నది నిజమే… దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. అంతేకాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో త్వరలో దండోయ్ ఏర్పాటు చేయనున్నారు. గోల్డ్ ATM లో ఇప్పుడు వినియోగదారులు తమ డెబిట్ , క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి ATM నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్లో మొదటి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి స్వచ్ఛత బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు. గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లోని గుల్జార్హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్తోపాటు పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్లో గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు గురించి గోల్డ్ సిక్కా సీఈవో సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ… ‘ఈ బంగారు నాణేల ద్వారా 99.99 శాతం నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డులను కూడా వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు. కాగా, ఈ మిషన్లలో రూ. రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల ముడిసరుకు లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏటీఎంలు ఉదయం 9.50 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అనంతరం మరిన్ని ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని సయ్యద్ తెలిపారు. పాతబస్తీ, సికింద్రాబాద్, అబిడ్స్లో మూడు ఏటీఎంలతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లో గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3,000 ఏటీఎంలు తెరవనున్నారని ఆయన వెల్లడించారు.
BJP Bike Rally: ఆందోల్ లో ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీ
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!