Seshanna Arrested: నయీమ్ అనుచరుడు శేషన్నను అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seshanna Arrested: సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాజీ నక్సటైట్, గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు మద్దనూరి శేషయ్య అలియాస్ శేషన్న ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్జోన్ డీసీపీ జోయోల్ శేషన్న అరెస్టును అధికారికంగా ప్రకటించారు. శేషన్న బెదిరింపులు, హత్యలకు పాల్పడ్డాడని, అతనిపై ఇప్పటి వరకు 9 కేసులను గుర్తించామన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయాడని, కొన్నాళ్ల నుంచి ల్యాండ్ సెటిల్మెంట్లు అక్రమ దందాలను చేస్తున్నట్లు తెలియడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు హుమయూన్నగర్లో ఆయుధాల కేసులో అరెస్టు చేశామని ప్రకటించారు. శేషన్న పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని గోల్కొండ పోలీసులు తెలిపారు. శేషన్న నానక్ రాంగూడ నుండి గచ్చిబౌలి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్నపై వివిధ పోలీస్ స్టేషన్ లలో 9 కేసులు వున్నట్లు తెలిపారు.
Read also: PFI: పీఎఫ్ఐపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల పాటు నిషేధం
Also Read
1993లో శేషన్నను మొదటిసారి ఆరేస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు. శేషన్న ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులను నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్ స్టార్ నయీంతో కలిసి అనేక నేరాలకు పాల్పడటమే కాకుండా.. నయీంతో కలిసి మావోయిస్ట్ అవతారం, 15 మంది నక్సల్ కమాండర్స్ తో శేషన్న పని చేశాడు. దళం కమాండర్ సుదర్శన్ రెడ్డి తోపాటు నాగన్న, మాధవన్న, మల్లన్న లతో పని చేశాడు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులతో శేషన్నకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మావోయిస్టులకు కొరియర్ గా, డెన్ కీపర్ గా పని చేశాడు. శేషన్న పై పలు కిడ్నాప్, మర్డర్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు వున్నాయని తెలిపారు. శేషన్న పై 6 మర్డర్ కేసులు,3 ఆర్మ్స్ యాక్ట్ కేసులు వున్నాయని, 9 ఎంఎం పిస్టల్, 5 తూటాలు లభించినట్లు వెల్లడించారు పోలీసులు. హైదరాబాద్ బీఎన్రెడ్డి నగర్లోని చైతన్యనగర్ కాలనీలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.
2016 ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లో హతం అయ్యాడు నయీమ్. ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు చేయాలని ఐటీశాఖ నిర్ణయించింది. ఆస్తులను సీజ్ చేసింది ఐటీ శాఖ మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గతంలోనే ఐటీ శాఖ గుర్తించగా అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్ చేశారు. ఈ పది ఆస్తులు విలువ సుమారు 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఆస్తులు సీజ్ విషయంపై నయీమ్ భార్యకు నోటీసులు ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?