Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- రూ. వందల కోట్ల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ముఠా
- నకిలీ జీఓలు, రెవెన్యూ రికార్డులతో భారీ కుట్ర
- హైకోర్టులో బెయిల్ తిరస్కరణ.. తమిళనాడులో అరెస్ట్
- కేసులో మరిన్ని కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bolla Brahmanayudu : గండిపేట మండలంలో రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన భారీ కుట్ర కేసులో ఎట్టకేలకు ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడి (Bolla Brahmanaidu)ని పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేట తహసీల్దార్ శ్రీ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును నార్సింగి పోలీసులు , సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (EOW) పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
రూ. 12 కోట్ల ఆర్థిక లావాదేవీలు.. నకిలీ జీవోలతో కబ్జా కుట్ర
గండిపేట మండలంలోని సర్వే నెం. 18లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని, దాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నిందితులు భారీ వ్యూహాన్ని రచించారు. అందుకోసం నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (Fake GOs), తప్పుడు రెవెన్యూ రికార్డులు , ఇతర నకిలీ అధికారిక పత్రాలను సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ దందా కోసం ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu) ఏకంగా రూ. 12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ. 4 కోట్లు, ఇప్పటికే అరెస్టయిన నిందితుడు రాధాకృష్ణకు రూ. 4 కోట్లు, మిగిలిన రూ. 4 కోట్లను ఈ కుట్రతో సంబంధమున్న ఇతర వ్యక్తులకు చెల్లించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందుగా తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, కేసులో ఉన్న ప్రాథమిక ఆధారాలు , దర్యాప్తు దశను పరిశీలించిన గౌరవ హైకోర్టు అతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో పరారీలో ఉన్న బ్రహ్మనాయుడి కోసం నార్సింగి , సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో అతడిని గుర్తించి, ఈరోజు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ , నిమ్మల కుటుంబ సభ్యులు అందరూ కలిసి పరస్పర కుట్రతో ప్రభుత్వ భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రభీన్ కుమార్లను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ప్రస్తుతం అరెస్టయిన ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడిని కూడా చట్టపరమైన ప్రక్రియ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాలను ఎలా దుర్వినియోగం చేశారు, ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!