Funds Misuse: సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తల నిధుల స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా గ్రామ పంచాయతీ నిధులు స్వాహా అవుతున్నాయి. స్వయానా సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త లు కుమ్మక్కయ్యారు. వారికి ఓ ప్రజా ప్రతినిధి కూడా మద్దతు ఇవ్వడం, మరో ఉన్నతాధికారి కూడా వారికి వంతపాడడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలసి కోటిన్నర పైగా స్వాహా చేశారు. స్వంత పేర్లతో చెక్కుల ద్వారా డబ్బులు స్వాహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్ మండలంలోని నాగినేని పాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్కామ్ చూస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు ఒక్కటి అయ్యారు. వారి భర్తలమీద చెక్ లను రాయించుకుని స్వాహా చేశారు. ఇద్దరూ కలిసి 116 చెక్ ల రూపంలో కోటి, 27లక్షల 8 వేల 324 రూపాయలు స్వాహా చేసిన అంశం బయటకు పొక్కకుండా బహు జాగ్రత్తగా అధికారులు కూడా సహకరించారు.
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
నాగినేనిప్రోలు పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. పంచాయతీ అభివృద్ధి పనుల పేరిట సుమారు కోటిరూపాయలకు పైగా నిధులను భర్తల పేరిట డ్రా చేశారు సర్పంచ్ శ్రావణి, ఉపసర్పంచ్ ఝాన్సీ లక్ష్మీలు. వారు భర్తల పేరిట చెక్కులను రాసి ప్రజల సొమ్మును స్వాహా చేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఇక్కడ ఉన్న ఓ ప్రజా ప్రతినిధి , ఉన్నత స్థాయి అధికారి కూడా వారికి మద్దతు ఇచ్చారని తెలుస్తోంది. ఇంకేముంది ఆ నిధుల స్వాహా వ్యవహారాన్ని బయట పడకుండా ఆ జిల్లా అధికారులు కూడా సహకరించారన్న అరోపణలు ఉన్నాయి.
నిధులు దుర్వినియోగం జరిగాయని గతంలోనే జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వగా ఆరు నెలల క్రితమే సర్పంచ్, ఉప సర్పంచ్ లకు జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసు ఇచ్చినప్పటికీ అవి మాత్రం మీడియాకు ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. అక్రమాలు జరిగాయని 2021 జూన్ లోనే మండల అధికారులు నివేదిక సమర్పించినప్పటికి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నుంచి ఓ ఉన్నతాధికారి అదే విధంగా జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి అడ్డకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వారిద్దరి వల్ల జిల్లా అధికారులు ఇంత కాలం చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తూ తూ మంత్రంగా చర్యలను ప్రారంభించారు. వాస్తవానికి పదవులనుంచి తొలగించాల్సి ఉండగా వారిని కేవలం మూడు నెలల పాటు తొలగిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి జిల్లా అధికారులను వివరణ అడిగితే మీడియాకు సమాచారం ఇవ్వవద్దని ఆదేశాలు ఉన్నాయని మేం మీడియా ముందు మాట్లాడమని అధికారులు చెబుతూ దాటవేస్తున్నారంటే వారి మీద అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!