Fuel Price : వామ్మో.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 నెలలపాటు శాంతించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. అయితే నిన్న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89కి చేరుకుంది. డీజిల్ ధర రూ.97.22కి పెరిగింది. అయితే నేడు మరోసారి ప్రెటోల్‌, డిజీల్‌ ధరలు పెరిగి వాహనదారులకు షాక్‌ ఇచ్చింది. తాజాగా లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి.

నాలుగు రోజుల్లో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం.. దీనితో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. ఇక హైదరాబాదులో పెట్రోలు ధర రూ.111.80, డీజిల్‌ రూ.98.10కు చేరుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.60కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 99.56లకు చేరుకుంది. ఇలాగే పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరిగితే సామాన్యుడిపై పెనుభారం పడుతుందని అంటున్నారు.