Harish Rao: ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వండి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయాలు ఉండబోతున్నాయనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా ప్రారంభ సమావేశాలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా తొలి సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించాయి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబితే దేనికైనా సిద్ధమేనని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చేసింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ గులాబీ పార్టీని నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తుంటే.. ఆ గతాన్ని తమ బలంగా మార్చుకోవాలని కేసీఆర్ టీమ్ నిర్ణయించుకున్నారు. తొలి భేటీలోనే అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగింది.
Read also: Parliament : పార్లమెంట్ దాడి.. సాగర్ శర్మ డైరీలో ఆధారాలు.. 22 మొబైల్ నంబర్ల విచారణ
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
అయితే వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. భారత రాష్ట్ర సమితి పార్టీకి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని హరీశ్ రావు లేఖ రాశారు. లేఖలో హరీశ్ రావు ఏం రాశారంటే.. రేపటి నుంచి శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీరు, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతిస్తే. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా మా సంస్కరణను సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కావున భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షానికి అనుమతి ఇవ్వగలమని కోరుతున్నాము. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని స్పీకర్ కు తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు.
Tamilnadu : తమిళనాడులో వర్ష బీభత్సం.. చిక్కుకున్న 800 మంది కోసం 48గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!