Food Poison in Hostels:ఫుడ్ పాయిజన్.. విద్యార్ధుల పరేషాన్
నాణ్యత లేని భోజనం, అపరిశుభ్రమైన బోరు నీళ్లు విద్యార్థుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.ఇటు స్కూల్స్ ,అటు హాస్టళ్లు, చివరికి బాసర ట్రిపుల్ ఐటీలో పెట్టే పుఢ్ పైన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా పాయిజన్ కావడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాంతులు, విరేచనాలతో తరచూ ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థులపై ఓ రిపోర్ట్.
మొన్న రూరల్ కేజీబీవీ తర్వాత ఘోట్కూరి ప్రాథమిక పాఠశాల అంతకంటే ముందు బాసర ట్రిపుల్ ఐటీ..తాజాగా భీంపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వరుసగా విద్యార్థులు తిన్న తిండితో ఆసుపత్రుల పాలవుతున్నారు…ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతుండగా, విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. క్వాలిటీ భోజనం అందించకపోవడం, పైగా శుద్ద జలం లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
‘
ఆదిలాబాద్ జిల్లాలో పలు స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…ఈనెల 9 న ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కస్తూర్భా విద్యాలయం, ఆదిలాబాద్ విద్యానగర్ లో నిర్వహిస్తున్నారు. సరైనసౌకర్యాలు లేకపోవడం, నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో 42 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు…10న మరో 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారు..అదే రోజు తాంసి మండలం ఘోట్కూరి ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు కావడంతో రిమ్స్ కు తరలించారు……11న రోజు విచారణ చేపట్టి ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు.
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
ఈ ఘటన మరుకముందే తాజాగా భీంపూర్ మండలానికి చెందిన కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది..ఇందులో 70 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు..విషయం తెసిన వెంటనే 35 మందిని రిమ్స్ కు తరలించగా, మిగతా విద్యార్థినిలను స్కూల్ లోనే వైద్యం అందిస్తున్నారు.కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 170 మంది వరకు విద్యార్థినిలు అస్వస్థతకు గురైన కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. విద్యార్థి సంఘాలు మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడి నాణ్యమైన భోజనం అందించకపోవడం, అలాగే ఆర్ ఓ ప్లాంట్ వాటర్ ఇవ్వకపోవడమే కారణమంటూ ఆరోపిస్తున్నారు.
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు..రిమ్స్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు
అయితే కాంట్రాక్టర్లు,కేజీబీవీలో ఎస్ ఓలు కుమ్ముక్కై నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఫుడ్ గురించి ప్రశ్నిస్తే..ఎస్ ఓలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!