Food Poison in Hostels:ఫుడ్ పాయిజన్.. విద్యార్ధుల పరేషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాణ్యత లేని భోజనం, అపరిశుభ్రమైన బోరు నీళ్లు విద్యార్థుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.ఇటు స్కూల్స్ ,అటు హాస్టళ్లు, చివరికి బాసర ట్రిపుల్ ఐటీలో పెట్టే పుఢ్ పైన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా పాయిజన్ కావడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాంతులు, విరేచనాలతో తరచూ ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థులపై ఓ రిపోర్ట్.
మొన్న రూరల్ కేజీబీవీ తర్వాత ఘోట్కూరి ప్రాథమిక పాఠశాల అంతకంటే ముందు బాసర ట్రిపుల్ ఐటీ..తాజాగా భీంపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వరుసగా విద్యార్థులు తిన్న తిండితో ఆసుపత్రుల పాలవుతున్నారు…ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతుండగా, విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. క్వాలిటీ భోజనం అందించకపోవడం, పైగా శుద్ద జలం లేకపోవడమే కారణమని తెలుస్తోంది.
‘
ఆదిలాబాద్ జిల్లాలో పలు స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…ఈనెల 9 న ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కస్తూర్భా విద్యాలయం, ఆదిలాబాద్ విద్యానగర్ లో నిర్వహిస్తున్నారు. సరైనసౌకర్యాలు లేకపోవడం, నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో 42 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు…10న మరో 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారు..అదే రోజు తాంసి మండలం ఘోట్కూరి ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు కావడంతో రిమ్స్ కు తరలించారు……11న రోజు విచారణ చేపట్టి ముగ్గురు సిబ్బందిపై వేటు వేశారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ఈ ఘటన మరుకముందే తాజాగా భీంపూర్ మండలానికి చెందిన కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది..ఇందులో 70 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు..విషయం తెసిన వెంటనే 35 మందిని రిమ్స్ కు తరలించగా, మిగతా విద్యార్థినిలను స్కూల్ లోనే వైద్యం అందిస్తున్నారు.కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 170 మంది వరకు విద్యార్థినిలు అస్వస్థతకు గురైన కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. విద్యార్థి సంఘాలు మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడి నాణ్యమైన భోజనం అందించకపోవడం, అలాగే ఆర్ ఓ ప్లాంట్ వాటర్ ఇవ్వకపోవడమే కారణమంటూ ఆరోపిస్తున్నారు.
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు..రిమ్స్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు
అయితే కాంట్రాక్టర్లు,కేజీబీవీలో ఎస్ ఓలు కుమ్ముక్కై నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఫుడ్ గురించి ప్రశ్నిస్తే..ఎస్ ఓలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..