Adilabad and Nizamabad: తెలంగాణ కశ్మీరం.. జిల్లాలను కమ్మేసిన పొగమంచు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad and Nizamabad: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పొగమంచు కమ్మేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కశ్మీరాన్ని తలపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో రహదారిపై లైట్ల వెలుతురులో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. చలికి వణుకుతూనే పనులకు వెళుతున్నారు. మూడు రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో దుబ్బపటి కప్పుకున్న వణుకుడు మాత్రం ఆగడం లేదు. జిల్లాల్లో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కశ్మీరాన్ని తలపిస్తుంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎదుటి వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.
Read also: Prabhas: పాన్ ఇండియా హీరోకి అదిరిపోయే విలన్ కటౌట్…
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
జిల్లాలకు కమ్మేసిన పొగమంచు..
ఆదిలాబాద్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. రహదారి పై తీవ్రమైన మంచుతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా మంచు ఆవరించినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పొగమంచు కమ్మేసింది. రోడ్లపై దట్టంగా పొగ మంచు అలుముకుని ఉండటంతో వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ రోడ్డు, బై పాస్ రహదారి తో పాటు ప్రధాన రోడ్ల లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాని పొగమంచు కమ్మేసింది. రోడ్లపై దట్టంగా పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపు మేరలో వాహనాలు కనిపించడం లేదు. దీంతో రహదారిపై ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది. కాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. హనుమకొండ,కాలేశ్వరం 353 జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. లక్ష్మారెడ్డి పల్లి,మొరంచపల్లి ప్రధాన రహదారి పూర్తిగా పొగ మంచు కమ్మేసింది. వాహనచోదకులు దగ్గరికి వచ్చే వరకు ఒక వాహనానికి మరో వాహనం కనబడకుండా ఇబ్బంది పడుతున్న వాహనదారులు వాపోతున్నారు.
Mahua Moitra: నేడు లోక్ సభ ముందుకు మహువా మొయిత్రా సస్పెన్షన్ నివేదిక..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!