NTV Telugu Site icon

Ponnam Prabhakar: రైతు రుణ మాఫీ చేస్తాం.. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తాం..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తామన్నాము ఇచ్చిన మాట ప్రకారం 5 నెర వేర్చామన్నారు. బీజేపీ నాయకులు ప్రజల ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధి చేయకుండా అక్షింతల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంటులో నేను చేసిన అభివృద్ధి తప్ప వినోద్ బండి చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ నాయన టీచర్ అంటున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడని చెబుతున్నాడని వ్యంగాస్త్రం వేశారు.

Read also: Covid-19: కరోనా కొత్త వేరియంట్.. బూస్టర్ డోస్ వేసుకున్న వారు కూడా తప్పించుకోలేరు

కరీంనగర్ పార్లమెంటులో నలుగురు ఎమ్మెల్యేలు వెలిశాల రాజేందర్ రావు తో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. ఆగస్టు 15 లోపు 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పేపర్ 1 ప్రణవ్ ఫెయిల్ అయ్యాడు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పేపర్ 2 ఎంపీ అభ్యర్థి పాస్ కావాలన్నారు. సప్లమెంటరీ పరీక్షలు రావద్దని కోరుకుంటున్నాను ఐదేళ్లు ఎవరైనా అధికారంలో ఉండాలన్నారు. దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను తీసేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావ్ ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
Rafa: నెతన్యాహుకు షాక్.. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి