NTV Telugu Site icon

KTR: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం

Ktr

Ktr

Hyderabad: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్కొరేటర్లతో సమావేశం అయ్యారు. ఓ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగతుంటే.. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కేటీఆర్ కార్పొరేటర్లకు పార్లమెంట్ ఎన్నికలపై దిశనిర్ధేశం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు పిలుపు నిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరపున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చినా.. వాటిని నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకుస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.