Hyderabad: హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీ.. నిర్మించేందుకు సిద్ధమైన HMDA..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరం గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలకు, ముఖ్యంగా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్ మహానగరం ఘనంగా స్వాగతం పలుకుతుంది. కాబట్టి హైదరాబాద్ జనాభా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న జనాభాతో ట్రాఫిక్ సమస్యలు మరియు కాలుష్యం ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కష్టాలు పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు.. హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీల నిర్మాణానికి హెచ్ ఎండీఏ సిద్ధమైంది. కాగా, ఈ విషయమై గత ప్రభుత్వానికి అధికారులు తమ ప్రతిపాదనను వెల్లడించారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ శివార్లలో కొత్త నగరాలను నిర్మించడం ద్వారా నగరంలో రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు కూడా మెరుగుపడతాయి. ఈ క్రమంలో నగర శివార్లలోని 11 ప్రాంతాల్లో మినీ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
Read also: Vijay Deverakonda: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్ట్ రివ్యూ..అద్భుతం అంటున్న దేవరకొండ
Also Read
- Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
- PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
- Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
- TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఈ క్రమంలో ఇబ్రహీం పట్నం, తుర్కపల్లి ప్రాంతాలను మినీ సిటీలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో బ్యాంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం తగ్గుతుంది. కానీ ఈ నగరాల అభివృద్ధికి అవసరమైన నిధులను పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిగల పార్టీల నుంచి టెండర్లు పిలవాలని హెచ్ఎండీఏ సూచించింది. ఇప్పటికే పలు అంశాల కారణంగా… నగర శివార్లలో… నగర భూములకు డిమాండ్ అంతంత మాత్రంగానే సాగుతోంది. భూమిని కొనుగోలు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో భూమి కొనుగోలు కష్టమవుతుంది. కాబట్టి మినీ సిటీల నిర్మాణానికి ఇదే సరైన సమయమని అధికారులు భావిస్తున్నారు. అయితే నగర శివార్లలో మినీ సిటీలను నిర్మించడం ద్వారా నిజంగానే హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతుందనే చెప్పాలి.
Inter Practical 2024: తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్.. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!
-
Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!