Hyderabad: హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీ.. నిర్మించేందుకు సిద్ధమైన HMDA..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరం గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలకు, ముఖ్యంగా టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్ మహానగరం ఘనంగా స్వాగతం పలుకుతుంది. కాబట్టి హైదరాబాద్ జనాభా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న జనాభాతో ట్రాఫిక్ సమస్యలు మరియు కాలుష్యం ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కష్టాలు పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు.. హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీల నిర్మాణానికి హెచ్ ఎండీఏ సిద్ధమైంది. కాగా, ఈ విషయమై గత ప్రభుత్వానికి అధికారులు తమ ప్రతిపాదనను వెల్లడించారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ శివార్లలో కొత్త నగరాలను నిర్మించడం ద్వారా నగరంలో రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు కూడా మెరుగుపడతాయి. ఈ క్రమంలో నగర శివార్లలోని 11 ప్రాంతాల్లో మినీ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
Read also: Vijay Deverakonda: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్ట్ రివ్యూ..అద్భుతం అంటున్న దేవరకొండ
Also Read
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
ఈ క్రమంలో ఇబ్రహీం పట్నం, తుర్కపల్లి ప్రాంతాలను మినీ సిటీలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో బ్యాంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం తగ్గుతుంది. కానీ ఈ నగరాల అభివృద్ధికి అవసరమైన నిధులను పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిగల పార్టీల నుంచి టెండర్లు పిలవాలని హెచ్ఎండీఏ సూచించింది. ఇప్పటికే పలు అంశాల కారణంగా… నగర శివార్లలో… నగర భూములకు డిమాండ్ అంతంత మాత్రంగానే సాగుతోంది. భూమిని కొనుగోలు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో భూమి కొనుగోలు కష్టమవుతుంది. కాబట్టి మినీ సిటీల నిర్మాణానికి ఇదే సరైన సమయమని అధికారులు భావిస్తున్నారు. అయితే నగర శివార్లలో మినీ సిటీలను నిర్మించడం ద్వారా నిజంగానే హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతుందనే చెప్పాలి.
Inter Practical 2024: తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్.. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు..
తాజావార్తలు
-
Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!