Etela Rajender : కేసీఆర్ సంస్కారం ఏపాటిదో అర్థమవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక-సారక్క జాతార ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 16 నుంచి 19వ తేది వరకు కన్నుల పండుగవగా జాతరను నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకుంనేందుకు కోట్లాది మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారంకు విచ్చేశారు. అయితే నిన్న తెలంగాణ తొలి మహిళ (గవర్నర్) తమిళసై సౌందరరాజన్ అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇవ్వాల్సిన ప్రొటోకాల్ మర్యాద కూడా ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మేడారంలో గవర్నర్ను అవమాంచారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంస్కారహీనమైన సంప్రదాయానికి తెర తీశారని, సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో అర్థమవుతోందన్నారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్కు గుర్తుచేస్తున్నాని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్వి చిల్లర వ్యాఖ్యలు ఆయన మండిపడ్డారు. ప్రజా ఆగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబయ్ పర్యటనకు వెళ్లాడని అన్నారు. జాతీయ పార్టీ లేకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!