Site icon NTV Telugu

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు.. జూన్ 7న ఛార్జిషీటు దాఖలు..

Mlc Kavitha Pitishan June

Mlc Kavitha Pitishan June

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్లపై ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7న ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Read also: BCCI-India Coach: ఆస్ట్రేలియా మాజీలకు కౌంటర్.. టీమిండియా కొత్త కోచ్‌పై జై షా హింట్!

మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. మార్చి 16న లిక్కర్ పాలసీ ఈడీ కేసులో, ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్-19 ప్రకారం.. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని, ఆమె రూ.100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
Hyderabad: ఆస్ట్రేలియాలో శవమై తేలిన హైదరాబాద్‌ యువకుడు.. సముద్రంలో మృతదేహం..

Exit mobile version