Telangana Elections 2023: ఇంటినుంచి ఓటేసేందుకు 28వేల మందికి పర్మిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 28,057 మంది ఓటర్లను ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, జర్నలిస్టులు, 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వికలాంగులు ఇలా అనేక వర్గాలకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆ సదుపాయాన్ని అమలు చేసేందుకు ఈసీ ప్రయత్నాలు ప్రారంభించింది. 44,097 మంది 12డి దరఖాస్తులను అధికారులకు అందజేయగా, 28,057 మంది అర్హులుగా గుర్తించారు. సిద్దిపేట నియోజకవర్గంలో అత్యధికంగా 752 మంది, బహదూర్పురలో అత్యల్పంగా 11 మంది ఉన్నారు. 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్కు 100 కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం ఉమ్మడి గుర్తు పొందేందుకు అర్హత లేని మండల స్వతంత్ర, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు అధికారులు తాజా గుర్తులను కేటాయించారు. ఈ నెల 30న ఓటింగ్ జరగనున్నందున అంతకు ముందే ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అర్హులైన అభ్యర్థుల చిరునామాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
ఎవరు అర్హులు?
80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని పొందేందుకు అర్హులు. తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 80 ఏళ్లు పైబడిన వృద్ధ ఓటర్లు 4.43 లక్షల మంది ఉండగా, 100 ఏళ్లు పైబడిన వారు 7,689 మంది ఉన్నారు. వైకల్యం శాతం 40 కంటే ఎక్కువ ఉంటే వికలాంగులు అర్హులు. తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 5.06 లక్షల మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు.
Also Read
ఇంట్లో కూర్చొని ఓటు వేయాలంటే ఏం చేయాలి?
ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని పొందాలనుకునే వృద్ధులు, వికలాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘ఫారం 12డి’ నింపి రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్లో ఓటు వేయలేకపోతున్నారనే సమాచారాన్ని ఈ ‘ఫారం 12డి’ ద్వారా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు.
‘ఫారం 12D’ ఎక్కడ పొందాలి? ఏమి నింపాలి?
ఫారం 12డిని భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ లింక్ని తెరిచి, ‘ఫారమ్ 12D’ని డౌన్లోడ్ చేయండి. దరఖాస్తుదారులు తాము ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారో సూచించాల్సి ఉంటుంది. వారి పూర్తి చిరునామా మరియు సంప్రదింపు ఫోన్ నంబర్ను చేర్చండి. దీంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గం పేరు, క్రమ సంఖ్యను కూడా ఓటరు జాబితాలో నింపాల్సి ఉంటుంది. వారు వృద్ధులైతే వారి వయస్సును పేర్కొనాలి. వికలాంగుల విషయంలో ‘పర్సన్ విత్ డిజేబిలిటీస్’ అని టిక్ చేయాలి. ఈ వివరాలన్నీ నింపిన ‘ఫారం 12డి’ దరఖాస్తు నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల్లోగా రిటర్నింగ్ అధికారి/అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి చేరాలి.
Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!