Election Commission: రేపు నగరానికి సీఈసీ.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన
Election Commission: అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమైంది. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రేపు (ఈ నెల 3)న రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్కృష్ణలో బస చేయనున్నారు. అక్కడ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమావేశం కానున్నారు. సీఈసీ బృందం రాకతో త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రానికి వస్తున్న ఎన్నికల అధికారుల బృందంలో ఎన్నికల కమిషనర్లు అనుపచంద్ర పాండే, అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అజయ్ భాదు, హిర్దేశ్ కుమార్, ఆర్కే గుప్తా, మనోజ్ కుమార్ సాహు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, సన్నాహాలను ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ఈ బృందం చీఫ్ సెక్రటరీ, డీజీపీతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనుంది. పర్యటన ముగిశాక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారు.
KTR: వ్యర్థాల వాహనాలు.. నేడు లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్
Also Read
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
తాజావార్తలు
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో