MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా.. జడ్చర్ల నియోజకవర్గంలోని సబండవర్గాలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంటే ఉంటామంటూ.. కారుగుర్తుకే ఓటేస్తామని ఆయా సంఘలా ఆధ్వర్యంలో తీర్మానాలు చేస్తున్నారు.
ఇప్పటికే జడ్చర్ల లోని ఆర్యవైశ్య సంఘం, స్వర్ణకారుల సంఘం మరియు బిలియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా నిన్న మిడ్జిల్, ఉరుకొండ మండలాల ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి వెంటే ఉంటామంటూ తీర్మానం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని వివిధ రకాల వ్యాపార వర్గాలు కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. మంచి చేసిన ప్రభుత్వానికి మామద్దతు ఉంటుందని లక్ష్మారెడ్డిని లక్షమెజార్టీతో గెలిపించే దిశగా తామంతా కృషి చేస్తామని తీర్మానం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చంద్రప్రకాష్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, ఆంజనేయులు.. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకి చెందిన నాయకులందరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అమ్మాపూర్ గ్రామం తరుపున పూర్తి మద్దతునిస్తూ కారుగుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇక మరోవైపు బాలానగర్ మండలం చింతకుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా 100 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన