EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఈసీ సీరియస్.. కేసు నమోదుకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది… ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఓ వీడియో విడుదల చేయడంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని.. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పటికీ రాజాసింగ్ నుంచి వివరణ రాకపోవడంతపై ఈసీ సీరియస్గా స్పందించింది.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇక, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రచారం, మీడియా ఇంటర్వ్యూలు మొదలైన వాటిపై 72 గంటల పాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం..
Read Also: Tollywood: రేపు టాలీవుడ్ ప్రముఖుల భేటీ..
Also Read
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు రాజా సింగ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడం.. ఈ రోజు మధ్యాహ్నం వరకు సమయం పొడిగించాలని కోరినప్పటికీ.. సమాధానం లేకపోవడం దృష్ట్యా, ఈ విషయంలో రాజా సింగ్ ఏమీ చెప్పలేదని భావించవచ్చు.. దీంతో.. ఈసీ తదుపరి చర్యలకు దిగింది. కాగా, యూపీ ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈ నెల 16న నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేస్తాం’ అంటూ రాజాసింగ్ వీడియో విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పటికే యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను, బుల్డోజర్లను యోగి తెప్పించారు. యోగికి ఎవరెవరు ఓటు వేయలేదో వారిని ఎన్నికల తరువాత గుర్తిస్తాం. జేసీబీ, బుల్డోజర్లు ఎందుకువస్తాయో మీకు తెలుసు కదా.. యూపీలోఉండాలని అకొంటున్నారా..లేదా? బిడ్డా.. యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి అంటూ ఆ వీడియోలో హెచ్చరించారు రాజాసింగ్. చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ.. మరుసటి రోజే నోటీసులు జారీచేసింది. గడువులోగా స్పందించపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. కానీ, ఇప్పటికీ రాజాసింగ్ స్పందించకపోవడంతో.. కేసు నమోదుకు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.
- Tags
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!