Site icon NTV Telugu

Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డ్

Telangana

Telangana

Ease of Doing Business: సరళతర వ్యాపార నిర్వహణ( ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు లభించింది. మీసేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు ఈ పురస్కారం తెలంగాణను వరించింది. ది డీజీ టెక్ కాన్ క్లేవ్ 2022లో ఎకనామిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని అందజేయనుంది. నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖలతో పాటు స్వీడన్, ఇజ్రాయెల్ సహకారంతో కాన్‌క్లేవ్ నిర్వహించనున్నారు.

Telangana Rains: గోదావరిలో పెరిగిన వరద.. ప్రమాద హెచ్చరిక జారీ

ఈ నెల 25న ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు పురస్కారం నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు సరళతర విధానంలో ప్రభుత్వం అనుమతి ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version