Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఈనెల 16న ఖాతాల్లో 1.53 లక్షలు
Singareni: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దసగ పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగా, 2022-23 సంవత్సరంలో, కార్మికులకు గత సంవత్సరం లాభం కంటే 32 శాతం ఎక్కువ వాటా చెల్లించడానికి నిధులు విడుదల చేయబడ్డాయి. అయితే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ.. సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ.2,222 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇందులో 32 శాతం దసరా బోనస్గా రూ. 711.18 కోట్లు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బోనస్ నిధులను విడుదల చేశారు. ఈ బోనస్ సొమ్మును ఈ నెల 16న సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అయితే ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.53 లక్ష చొప్పున బోనస్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 11వ వేతన ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కార్మికులకు 23 నెలల బకాయిలు చెల్లించింది. ఈ మేరకు ప్రభుత్వం దాదాపు రూ.1,450 కోట్లు చెల్లించింది. కాగా, మంచిర్యాల సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాల్లో కార్మికులకు వాటా కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. గతంలో ఇచ్చిన షేర్ కంటే.. ఏకంగా 32 శాతం షేర్ ప్రకటించారు. దీంతో.. ఈ ఏడాది.. సింగరేణి కార్మికుల ముఖాల్లో రెట్టింపు ఆనందం వెల్లివిరుస్తోంది.
Also Read
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
Read also: ENG vs NZ: పాపం డెవాన్ కాన్వే.. ఆ ఆనందంను 15 నిమిషాలు కూడా ఉంచని రచిన్ రవీంద్ర!
సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ కింద దసరా కానుకగా రూ.711.18 కోట్లు ఈ నెల 16న చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ నిరుడు ద్వారా వచ్చిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతం దసరా పండుగకు వారం రోజుల ముందు చెల్లిస్తున్నట్లు తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ను అందుకుంటారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న కార్మికులకు సింగరేణి ఉద్యోగుల తరపున సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపునకు సంబంధించి డైరెక్టర్ ఎన్ బలరాం గురువారం సర్క్యులర్ జారీ చేశారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో