Tragedy: మద్యం మత్తులో పాపను చంపిన తల్లి
- మద్యం మత్తులో మానవత్వం మరిచిన తల్లి
- ఐదు నెలల పాపను దుప్పటి కప్పి గొంతు నులిమిన రమ్య
- కన్నతల్లిని రిమాండ్కు తరలించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మద్యానికి బానిసైన కన్నతల్లి ముక్కు పచ్చలారని కన్న కూతురినే కడతేర్చింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
ఇక్కడ చూడండి.. ఇక్కడ బెడ్పై తాపీగా కూర్చున్న మహిళ పేరు రమ్య. ఈమెకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అమ్మాయి వయసు 5 నెలలు. ఆ చిన్నారికి ముద్దుగా శివాని అని పేరు కూడా పెట్టారు. మల్లేష్ ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తు ఇంటిని పోషిస్తున్నాడు…
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
Health Tips: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
రమ్య మద్యానికి బానిసైంది. రోజూ మద్యం లేనిదే ఉండలేకపోతోంది. ఐతే ఆమెను మద్యం మానమని భర్త మల్లేష్ ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ రమ్య తన తీరు మార్చుకోలేదు. అంతే కాదు మద్యం తాగుతూ 5 నెలల పాపను కూడా పట్టించుకోవడం మానేసింది..
మద్యం మాని పాపను పట్టించుకోమని… లేకుంటే ఇంటి నుంచి వెళ్ళి పొమ్మని మల్లేష్ మందలించాడు. ఐతే ఆ చిన్నారికి జ్వరం రావటం మందులు పోయకపోవటంతో భార్య, భర్త మధ్య గొడవైంది. దీంతో రమ్య… ఫుల్లుగా తాగి దారుణానికి పాల్పడింది. తాగిన మైకంలో ఐదు నెలల కూతురు శివాని ముఖం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురు ఎక్కడ అని అడిగాడు. కూతురు చనిపోయింది అని చెప్పింది. కూతురు శివాని ఎలా చనిపోయిందని అడగగా.. ఏదో పురుగు కుట్టి చనిపోయింది అంటూ బుకాయించింది. అది నమ్మని భర్త మల్లేష్ గట్టిగా అడగగా తాను చేసిన ఘనకార్యం బయటపెట్టింది…
భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హంతకురాలు రమ్యను అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కు తరలించారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా కన్న కూతురునే చంపేసింది ఆ కసాయి తల్లి. పైగా కూతురు పోయిందన్న బాధ కూడా ఆమెలో కనిపించడం లేదు..
Kanakadurgamma Temple: ప్లేట్ కలెక్షన్ నిలిపివేత.. ఇంద్రాకిలాద్రిపై పంతుళ్ల లొల్లి!
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..