Tragedy: మద్యం మత్తులో పాపను చంపిన తల్లి
- మద్యం మత్తులో మానవత్వం మరిచిన తల్లి
- ఐదు నెలల పాపను దుప్పటి కప్పి గొంతు నులిమిన రమ్య
- కన్నతల్లిని రిమాండ్కు తరలించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మద్యానికి బానిసైన కన్నతల్లి ముక్కు పచ్చలారని కన్న కూతురినే కడతేర్చింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
ఇక్కడ చూడండి.. ఇక్కడ బెడ్పై తాపీగా కూర్చున్న మహిళ పేరు రమ్య. ఈమెకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అమ్మాయి వయసు 5 నెలలు. ఆ చిన్నారికి ముద్దుగా శివాని అని పేరు కూడా పెట్టారు. మల్లేష్ ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తు ఇంటిని పోషిస్తున్నాడు…
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
Health Tips: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
రమ్య మద్యానికి బానిసైంది. రోజూ మద్యం లేనిదే ఉండలేకపోతోంది. ఐతే ఆమెను మద్యం మానమని భర్త మల్లేష్ ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ రమ్య తన తీరు మార్చుకోలేదు. అంతే కాదు మద్యం తాగుతూ 5 నెలల పాపను కూడా పట్టించుకోవడం మానేసింది..
మద్యం మాని పాపను పట్టించుకోమని… లేకుంటే ఇంటి నుంచి వెళ్ళి పొమ్మని మల్లేష్ మందలించాడు. ఐతే ఆ చిన్నారికి జ్వరం రావటం మందులు పోయకపోవటంతో భార్య, భర్త మధ్య గొడవైంది. దీంతో రమ్య… ఫుల్లుగా తాగి దారుణానికి పాల్పడింది. తాగిన మైకంలో ఐదు నెలల కూతురు శివాని ముఖం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురు ఎక్కడ అని అడిగాడు. కూతురు చనిపోయింది అని చెప్పింది. కూతురు శివాని ఎలా చనిపోయిందని అడగగా.. ఏదో పురుగు కుట్టి చనిపోయింది అంటూ బుకాయించింది. అది నమ్మని భర్త మల్లేష్ గట్టిగా అడగగా తాను చేసిన ఘనకార్యం బయటపెట్టింది…
భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హంతకురాలు రమ్యను అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కు తరలించారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా కన్న కూతురునే చంపేసింది ఆ కసాయి తల్లి. పైగా కూతురు పోయిందన్న బాధ కూడా ఆమెలో కనిపించడం లేదు..
Kanakadurgamma Temple: ప్లేట్ కలెక్షన్ నిలిపివేత.. ఇంద్రాకిలాద్రిపై పంతుళ్ల లొల్లి!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!