ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు, రూ.37.94 కోట్ల జరిమానా విధించారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు… లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నాం అని డీజీపీ తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్న విషయం తెలిసిందే.