Devotees to Temples: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి నాలుగు గంటల సమయం
Devotees to Temples: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు ఉదయం నుంచి భక్తులను క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం కాగా.. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ రుసుముతో దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read also: Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
అయితే.. శనివారం ఆలయ ఆదాయం రూ.62,55,860. ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,15,350, వీఐపీ టిక్కెట్ల ద్వారా రూ.16.20 లక్షలు, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.9 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి సుప్రభాత విరామాన్ని చూసేందుకు కూడా భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉండగా కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు కిక్కిరిసిపోవడంతో భక్తులు మెట్ల మీదుగా కొండపైకి చేరుకుంటున్నారు. అదేవిధంగా కొండపైన కార్ పార్కింగ్ లేకపోవడంతో దిగువన పార్కింగ్ చేస్తున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆదిదంపతుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని, ఈరోజు, రేపు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు.
SRH vs KKR: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!