NTV Telugu Site icon

వేములవాడలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు-కేటీఆర్‌

ktr

ktr

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్… ఇవాళ రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు.. మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలిశారు.. తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రికి అందించారు. ఇక, ఆ తర్వాత వేములవాడ అభివృద్ధిపై సమీక్షించిన మంత్రి కేటీఆర్.. అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20 కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయించిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే రమేష్‌ బాబు.