MLC Kavitha: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీ ముగియనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడి అధికారులు కవితను హాజరు పర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 15న హైదరాబాదులో లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేశారు. ఈడి కస్టడీలో లిక్కర్ స్కాంలో అధికారులు కవిత పాత్రపై ఇంటరాగేషన్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు నిందితులు అరెస్టై వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడి అధికారులు కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో కలిపి విచారించేందుకు మరో రెండు రోజుల కస్టడీ పొడగించాలని కోర్టును ఈడి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండు వాదనలను రోస్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది. మరోసారి కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా? లేక జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఇస్తుందా? రెండూ లేకుండా బెయిల్ మంజూరు చేస్తుందా? అనే అంశాలపై ఇవాళ స్పష్టత వస్తుందని అంటున్నారు.
Read also: Sreeleela : అదిరిపోయే లుక్ లో శ్రీలీలా కిర్రాక్ పోజులు..
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ఇప్పటివరకు కస్టడీలో ఉన్న కిక్ బ్యాక్ల గురించి కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వందల కోట్లు చేతులు మారాయని ఈడీ చెబుతోంది. ఈ విషయంపై మరింత లోతైన ప్రశ్నలు వేయాల్సి ఉందని అంటున్నారు. నలుగురు వ్యక్తుల వాంగ్మూలాలను కవిత నుంచి అడిగామని ఆమెకోర్టుకు తెలిపారు. డాక్టర్ చెప్పినట్లు కవితకు మందు ఇస్తామని ఈడీ చెబుతోంది. సమీర్ మహేంద్రుడితో పాటు కవితను కూడా విచారించాలని ఈడీ తెలిపింది. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు, పీఏ శరత్ నిన్న రాత్రి కలిశారు. కవితతో సుమారు గంటపాటు మాట్లాడారు. కవిత భర్త అనిల్ తొలుత ఆమె యోగక్షేమాలు అడిగి ఆమెకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని వావిరాజు రవిచంద్ర హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో న్యాయవాది మోహిత్ రావు ఆమెతో పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు.
MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!
తాజావార్తలు
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!