Cyberabad CP Stephen Raveendra: పబ్ల యాజమాన్యంతో సమావేశం.. ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad CP Stephen Raveendra Holds Review Meeting With Pub Owners: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పబ్ల యాజమాన్యంతో సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల గురించి అవగాహన కల్పించిన ఆయన.. లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. మైనర్లను పబ్లలోకి అనుమతించొద్దని అన్నారు. నిబంధనలకు లోబడి శబ్దాలు/ధ్వని స్థాయిలు ఉండాలని తెలిపారు. బ్యాకప్తో కూడిన సీసీటీవీ కెమెరాల ఫీడ్ను పర్యవేక్షించడానికి, ప్రాంగణాన్ని సౌండ్ప్రూఫ్ చేయడానికి, వాలెట్ డ్రైవర్లను నిమగ్నం చేయడానికి, కస్టమర్లను సిబ్బంది పరీక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
సైబరాబాద్ పరిధిలోని పబ్ల నిర్వహణ బాధ్యతాయుతంగా నిర్వహించి.. నగరంతో పాటు రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టాలని సీపీ కోరారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అని అన్నారు. ముఖ్యంగా.. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని ఆదేశించారు. పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చినందుకే ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని.. నివాసితులకు అసౌకర్యం కలిగించొద్దని చెప్పారు. బాధ్యతాయుతమైన రీతిలో వ్యాపారాన్ని నదుపుకోవాలని.. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి, పౌరులకు ఎలాంటి అసౌకర్యాన్ని కల్పించొద్దని హెచ్చరించారు. స్థానికుల నుంచి ఏ చిన్నపాటి ఫిర్యాదు వచ్చినా.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
ఇదిలావుండగా.. హైదరాబాద్లో పబ్ నిర్వహణపై ఇటీవల హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 10 దాటితే పబ్స్లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చింది. అయితే.. హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ, పబ్ యాజమాన్యాలు మునుపటిలాగే వ్యవహరిస్తుండడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీ స్టీఫెన్ రవీంద్ర మరోసారి హైకోర్టు ఆదేశాలపై అవగాహన కల్పించి.. నిబంధనల్ని ఉల్లంఘించొద్దని సీరియస్గా హెచ్చరించారు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!