Cyberabad CP Stephen Raveendra: పబ్ల యాజమాన్యంతో సమావేశం.. ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad CP Stephen Raveendra Holds Review Meeting With Pub Owners: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పబ్ల యాజమాన్యంతో సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల గురించి అవగాహన కల్పించిన ఆయన.. లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. మైనర్లను పబ్లలోకి అనుమతించొద్దని అన్నారు. నిబంధనలకు లోబడి శబ్దాలు/ధ్వని స్థాయిలు ఉండాలని తెలిపారు. బ్యాకప్తో కూడిన సీసీటీవీ కెమెరాల ఫీడ్ను పర్యవేక్షించడానికి, ప్రాంగణాన్ని సౌండ్ప్రూఫ్ చేయడానికి, వాలెట్ డ్రైవర్లను నిమగ్నం చేయడానికి, కస్టమర్లను సిబ్బంది పరీక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
సైబరాబాద్ పరిధిలోని పబ్ల నిర్వహణ బాధ్యతాయుతంగా నిర్వహించి.. నగరంతో పాటు రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టాలని సీపీ కోరారు. సౌండ్ పొల్యూషన్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అని అన్నారు. ముఖ్యంగా.. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని ఆదేశించారు. పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చినందుకే ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని.. నివాసితులకు అసౌకర్యం కలిగించొద్దని చెప్పారు. బాధ్యతాయుతమైన రీతిలో వ్యాపారాన్ని నదుపుకోవాలని.. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి, పౌరులకు ఎలాంటి అసౌకర్యాన్ని కల్పించొద్దని హెచ్చరించారు. స్థానికుల నుంచి ఏ చిన్నపాటి ఫిర్యాదు వచ్చినా.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
ఇదిలావుండగా.. హైదరాబాద్లో పబ్ నిర్వహణపై ఇటీవల హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 10 దాటితే పబ్స్లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చింది. అయితే.. హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ, పబ్ యాజమాన్యాలు మునుపటిలాగే వ్యవహరిస్తుండడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీ స్టీఫెన్ రవీంద్ర మరోసారి హైకోర్టు ఆదేశాలపై అవగాహన కల్పించి.. నిబంధనల్ని ఉల్లంఘించొద్దని సీరియస్గా హెచ్చరించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!