Cyber frauds: నిరుద్యోగులపై సైబర్ వల.. నమ్మించి రూ.9.79 లక్షలు దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber frauds: సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్లతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. యువత మాత్రం మోసపోతూనే వున్నారు. నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని పార్టీ టైమ్ జాబ్స్ ద్వారా సంపాదించుకోవచ్చని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడడానికి అత్యాశ, అవగాహన లేమి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న మూర్ఖత్వం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
Read also: Dogs Attacking Deers: అనంతగిరిలో దారుణం.. జింకలను పీక్కుతింటున్న కుక్కలు
Also Read
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ అనేయువకుడు నిరుద్యోగి. అయితే ఒక యాప్ లో పార్ట్ టైం జాబ్ కోసం అప్లై చేశాడు. ఇది గమనించిన సైబర్ కేటుగాళ్లు శ్రీకాంత్ ను టార్గెట్ చేశారు. అతనికి లింక్ పంపి.. కాల్ చేశారు. పార్ట్ టైం జాబ్ ఉందని కానీ.. దానికోసం ఒక టాస్క్ ఉంటుందని శ్రీకాంత్ ను నమ్మించారు కేటుగాళ్లు. అంతేకాకుండా పార్ట్ టైంలో ఎక్కువ మణి సంపాదించ వచ్చని తెలుపడంతో ఆశ పడ్డాడు శ్రీకాంత్. దీంతో టాస్క్ పూర్తి చేయాలంటే లక్షా 20 వేలు కడితే 2.50లక్షలు వస్తాయని చెప్పారు. అది నిజమని నమ్మిన శ్రీకాంత్ వారికి ఓటిపి, డబ్బులు మొత్తం పంపడం స్టార్ట్ చేశాడు. అత్యాశకు పోయి విడతల వారీగా 9 .79లక్షలు చెల్లించాడు. మళ్లీ సైబర్ కేటుగాళ్ల నుంచి కాల్ రావడం మరో 8లక్షలు పంపాలని ఒత్తిడి చేయడంతో శ్రీకాంత్ కు అనుమానం వచ్చింది. వారు పంపిన లింక్ లు అన్ని సర్చ్ చేయగా ఫేక్ అని లేలింది. దీంతో శ్రీకాంత్ మోస పోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాంత్ చెప్పిన ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాజల్ బెడ్ రూం ఫోటోస్ వైరల్..
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!