అవకాశం దొరికితే చాలు మోసగాళ్ళు డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల ఒక బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి కోట్లరూపాయలు కాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడికి షాకిచ్చారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ కు చెందిన నితిన్ తన అక్క పెళ్లి కోసం లక్షరూపాయలకు పైగా బ్యాంకులో దాచుకున్నాడు.
నితిన్ దాచుకున్న లక్ష రెండు వేల రూపాయలు ఓ లింకు ఓపెన్ చేయడంతో ఖాళీ అయిపోయాయి. ఆన్ లైన్ ట్రాన్షాక్షన్ పనిచేయడం లేదంటూ ఐబీపీ కష్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు నితిన్. కాసేపట్లోనే అతని అకౌంట్ ఖాళీ అయిపోయింది. కొద్ది క్షణాల్లో లింక్ రావడంతో ఓపన్ చేసిన అనంతరం లక్ష రెండు వేలు తన ఖాతాలో నుంచి మాయం అయిపోయాయి. దీంతో పరిగి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు నితిన్. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైం కు పంపించారు పరిగి పోలీసులు. మీ ఫోన్ కి వచ్చే లింక్ లు ఓపెన్ చేసి ఇబ్బందులు పడవద్దని పోలీసులు యువతీ, యువకులకు సూచిస్తున్నారు.