Illegal Weapons in Telangana: హైదరాబాద్ లో రాజ్యమేలుతున్న గన్ కల్చర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Weapons in Telangana: తెలంగాణ వ్యాప్తంగా గన్ కల్చర్ విస్తరిస్తుంది. కూర్చొని పరష్కిరించుకునే రోజులు పోయాయి. వ్యవహారం తేలిపోవాలంటే గన్ చేతిలో వుండాల్సిందే. రౌడీషీటర్లు, నేరస్థులు పిస్తోళ్లు, రివాల్వర్లను వినియోగిస్తున్నారు. అయితే.. బెదిరింపులు, దోపిడీలు, అపహరణలు, హత్యలు, ఇవన్నీ చేయాలంటే గన్నులుండాల్సిందే. నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులూ స్థిరాస్తి సెటిల్మెంట్లకు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి రౌడీషీటర్లు, నేరస్థుల చేతుల్లోనే 80 శాతం వరకూ ఆయుధాలు ఉన్నాయి. ఈతుపాకులను రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. అయితే.. గతంలో కరడుగట్టిన నేరగాళ్ల వద్ద మాత్రమే ఇలాంటి ఆయుధాలు ఉపయోగించేవారు. ఇప్పుడు పాతబస్తీలో నేరస్థులు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని కొందరు రియల్టర్లు, రౌడీషీటర్ల వద్ద అత్యాధునిక పిస్టళ్లు, తుపాకులు, రివాల్వర్లు రాజ్యమేలుతున్నాయి. వీరు ల్యాండ్ సెటిల్ మెంట్లు, రియల్ ఎస్టేట్ గొడవలు, బెదిరింపులకు పాల్పడెందుకు తుపాకులు వాడుతున్నారు.
మొన్న మాదాపూర్ లో ల్యాండ్ గొడవల కారణంగా ఇస్మాయిల్ పై మరో వర్గం కాల్పులు జరిపగా.. ఒకరు మృతి చెందారు. అయితే ఇదిలా వుంటే.. జీవన్ రెడ్డి హత్యకు కుట్రకు ఘటనలో నిందితుడు ప్రసాద్ 30 వేలకు తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం. గన్ కొనుగోలు కోసం నాందేడ్ వాసిని సంప్రదించిన చాటింగ్ బట్ట బయలైంది. తాజాగా మునుగోడు లో గన్ ఫైర్ కలకలం రేపింది.
Also Read
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
మునుగోడు కాల్పుల ఘటన కు హైదరాబాద్ లింక్ లు వున్నట్లు ,అక్రమ సంబంధమే కాల్పులకు కారణంగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లింగస్వామి పై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు తెగబడ్డారు. అయితే బాలకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే దీనికిగల కారణం లింగ స్వామి భార్య పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సూపరి గ్యాంగ్ తో డీల్ చేసినట్లు విచారణలో తేలిందని సమాచారం.
అయితే ఇటువంటి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిపై కాల్పులు కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీ మోగాల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఆగస్టు 3న అఫ్సర్ అనే వ్యక్తి తన ఇంటి గోడ పై ఉన్న బల్లిని వెపన్ తో ఫైరింగ్ చేసాడు. దీంతో అక్కడే ఆడుకుంటున్న బాలుడు యూసుఫ్ ఆలీకి బుల్లెట్ భుజం క్రింద తగిలి గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని బహదూర్ పురా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించా వైద్యం అందించారు. బాలుడికి ఎటువంటి ప్రమాదం లేదని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం మేరకు మోఘల్ పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gorantla Madhav Video Call Leak Issue: గోరంట్ల మాధవ్ రాజీనామాకు టీడీపీ నేతల డిమాండ్..
- Tags
తాజావార్తలు
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!