IND Vs AUS: ఫ్యాన్స్ దెబ్బ.. హెచ్సీఏ అబ్బా.. మ్యాచ్ టిక్కెట్ల విక్రయంలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా టీ20లో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడాలని క్రికెట్ అభిమానులు పరితపిస్తారు. అందులోనూ ఆ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుందంటే అభిమానులు ఊరికే ఉంటారా చెప్పండి. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నెల 25న జరిగే మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, తెలంగాణ జిల్లాల నుంచి భారీగా అభిమానులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఈ మేరకు జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు. అయితే ఆఫ్లైన్ టిక్కెట్లను విక్రయించడంలో హెచ్సీఏ తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Allu Arha: ఆమె చేతిలో ఓడిపోయిన అల్లు అర్జున్.. వీడియో వైరల్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను జింఖానా గ్రౌండ్స్లో విక్రయిస్తామని తొలుత హెచ్సీఏ ప్రకటించింది. అయితే జింఖానా మైదానంలో అటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడంతో అభిమానులు ఉప్పల్ స్టేడియానికి వెళ్తున్నారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. మ్యాచ్ టిక్కెట్ల విషయంలో హెచ్సీఏ గోల్మాల్ చేస్తోందంటూ అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఈనెల 15న ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయిస్తామని హెచ్సీఏ చెప్పింది. కానీ 39వేల టిక్కెట్లు పేటీఎంలో 10 నిమిషాల్లో ఖాళీ అయిపోయాయి. దీంతో ఆఫ్లైన్లో అయినా మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేయాలని అభిమానులు భావించారు. కానీ ఇప్పటి వరకు ఆఫ్లైన్లో టిక్కెట్ల జాడ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాదిగా చేరుకున్న అభిమానులను ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఉండేలా చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేస్తున్నారు. అటు ఈ అంశంపై ఓ న్యాయవాది కూడా హెచ్ఆర్సీని ఆశ్రయించారు. అభిమానుల గందరగోళం నేపథ్యంలో హెచ్సీఏ దిగి వస్తుందేమో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!