PM Modi Tour: మోడీ పర్యటనపై సీపీ రంగనాథ్.. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Ranganath Press Meet Security Arrangements Ahead Of PM Modi Tour: శనివారం (08-07-23) వరంగల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో.. భద్రత ఏర్పాట్లపై సీపీ రంగనాథ్ ప్రెస్మీట్ నిర్వహించారు. మోడీ పర్యటన సందర్భంగా తాము మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలకు అదనంగా.. ఇద్దరు ఐజీ స్థాయి, 10 మంది డీసీపీ ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 56 సీఐలు, 250 మంది ఎస్సైలు, 3500 మంది పోలీసులు.. బందోబస్తు విధుల్లో ఉంటారని వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నామని.. పబ్లిక్ కమిషన్ ఎగ్జామ్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే.. 8 గంటల వరకే పరీక్ష కేంద్రాలకే చేరుకోవాలని సూచించారు. అదాలత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. మోడీ సభకు వచ్చే కార్యకర్తలు.. 9 నుంచి 9.30 లోపే గ్రౌండ్కు చేరుకోవాలన్నారు. ప్రధాని టూర్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
60 Snakes: అమ్మ బాబోయ్.. ఏందయ్యా ఇది.. ఆ ఇంట్లో అన్ని పాములు..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ఇదిలావుండగా.. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ రేపు ఉదయం 7:35 గంటలకు వారణాసి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి, 9:25 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి MI 17 హెలికాప్టర్లో బయలుదేరి, మామునూరు ఎయిర్స్ట్రిప్కు 10:15 గంటలకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి 10:30 గంటలకు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొని, 10:45 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి.. 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. 11:35 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తొలుత వేదికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం ఇస్తారు. అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడాక.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించి, బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు.
Odisha High Court: అలా చేస్తే అత్యాచారం కాదు.. ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..