తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కోవిడ్ బారినపడ్డారు.. మరోవైపు.. సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. ఇలా చాలా మందికి కోవిడ్ సోకింది.. తాజాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో… మంత్రులు, ఇతర నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. జిల్లాలో పంట నష్టంపై తాజాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇతర నేతలతో కలిసి పర్యటించారు గండ్ర దంపతులు… మంత్రులతో కలిసి పరకాల నుండి నర్సంపేటకు హెలికాప్టర్లో వెళ్లారు.. అయితే, నిన్న జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు గండ్ర దంపతులు.. దీంతో.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక, తమతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కోవిడ్ టెస్ట్లు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గండ్ర దంపతులు.
Read Aslo: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం