NTV Telugu Site icon

Jubilee Hills Pub Case: మరో కీలక పరిణామం… నిందితులకు డీఎన్‌ఏ టెస్ట్‌లకు కోర్టు ఓకే

Court

Court

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఆమ్నిషాయా పబ్‌ రేప్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుల డీఎన్​ఏ సేకరణను అనుమతి ఇచ్చింది కోర్టు.. బాలికపై గ్యాంగ్‌ రేపు కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. నిందితుల డీఎన్​ఏ సేకరణ కోఎసం అనుమతికోరుతూ కోర్టును ఆశ్రయించగా.. డీఎన్‌ఏ సేకరణకు కోర్టు అనుమతి ఇచ్చింది.. దీంతో, నిందితుల నుంచి డీఎన్​ఏ సేకరించనున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు పోలీసులు… డీఎన్​ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు పోలీసులు..

Read Also: YSRCP: అధికార పార్టీలో ఉన్న ఆ అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి గిట్టదా..?

ఇక, ఈ కేసు విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్ గా డీఎన్‌ఏ రిపోర్ట్ కీలకంగా మారనుంది.. అవసరమైతే బాధితురాలి డీఎన్‌ఏను కూడా సేకరించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ ఘటనపై కోర్టులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.. నిందితుల పాస్‌పోర్ట్‌లను సైతం సీజ్‌ చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.. నిందితులకు బెయిల్ లభిస్తే దేశం వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురి బెయిల్ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.. కాగా, మే 28వ తేదీన మైనర్ బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్​ను పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం మైనర్లు జువైనల్ హోంలో.. సాదుద్దీన్ చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.