NTV Telugu Site icon

T Congress : నేటి నుంచి కాంగ్రెస్‌ రైతు రచ్చబండ కార్యక్రమం

Revanth Reddy

Revanth Reddy

ఇవాళ్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు డిక్లరేషన్ పై పల్లె పల్లెకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే.. నేడు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.

కొమురవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, హుజూర్‌నగర్‌లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జహీరాబాద్ నియోజక వర్గంలో న్యాల్ కల్ మండల కేంద్రంలో వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి లు పాల్గొననున్నారు.

వీరితో పాటు.. కామారెడ్డి రూరల్ మండలంలోని గూడెం గ్రామంలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సంగారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కరీంనగర్ లోకసభ పరిధిలోని నగునూరు గ్రామంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్‌ రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.