Site icon NTV Telugu

ఇంటర్ బోర్డు ముందు జగ్గారెడ్డి దీక్ష

తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Read Also: మేడారం భక్తులకు శుభవార్త.. 3845 ప్రత్యేక బస్సులు

కరోనా కారణంగా విద్యార్థులకు క్లాసులు జరగలేదని… ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో వారు ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయారని జగ్గారెడ్డి ఆరోపించారు. 4.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తే 2.35 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని.. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన మండిపడ్డారు. విద్యావ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతోందని జగ్గారెడ్డి విమర్శలు చేశారు.

Exit mobile version